అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థిని

నవతెలంగాణ-భిక్కనూర్
అంతర్జాతీయ కరాటే పోటీలకు పట్టణానికి చెందిన విద్యార్థిని నంద శ్రీనిధి ఎంపికయింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఇండియా- నేపాల్ కరాటే ఛాంపియన్ షిప్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పథకాన్ని గెలుచుకుంది. అలాగే వచ్చే నెలలో దుబాయి దేశంలో నిర్వహించే అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న మండల కేంద్ర విద్యార్థిని నంద శ్రీనిధిని మండల వాసులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు

Spread the love