గ్రామపంచాయతీ భవన నిర్మాణ శంకుస్థాపన…

నవతెలంగాణ-గోవిందరావుపేట
సోమల గడ్డ గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతన పంచాయతీ భవన నిర్మూణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సర్పంచి మంగా ఏలేంద్ర నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలేంద్ర నరసింహ మాట్లాడుతూ పంచాయతీ కార్యాలయం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు సొంత భవనం లేక ఇతర ప్రభుత్వ భవనాలలో నిర్వహించడం జరిగిందని ప్రస్తుతం పంచాయతీ భవనం మంజూరి కావడంతో నేడు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులకు ప్రజాప్రతినిధులకు సర్పంచ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే భవనాన్ని నిర్మాణం పూర్తి చేసుకొని గొప్పగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా జరుపుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ తో పాటు గ్రామస్తులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love