హీరో శర్వానంద్ నటిస్తున్న 35వ చిత్రం ‘మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఇక నా మాటే..’ పాటను ఈనెల 28న విడుదల చేయనున్నారు. సాంగ్ పోస్టర్లో శర్వానంద్ షేడ్స్తో ట్రెండీ అవతార్లో ఆకట్టుకున్నారు. స్కేటర్ రైడింగ్ చేస్తూ కనిపించారు. యూనిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కతి ప్రసాద్, ఫణి వర్మ, అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా.