ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన లేదు: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ కూల్చేస్తుందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమకు అలాంటి ఆలోచన లేదని, ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తమకు ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టారనీ, ఇప్పుడూ వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలను ఆయన వెల్లడించారు.

Spread the love