ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేసిన ఎంపీటీసీ

నవతెలంగాణ హైదరాబాద్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి  నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీటీసీ మంగి విజయ్ మంగళవారం నామినేషన్​ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జి.రవి నాయక్ కు నామినేషన్  పత్రాలను అందజేశారు.
. ఈసందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యుల హక్కుల సాధన కోసమే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో నిలబడుతున్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి విధులు, నిధులు లేకుండా కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోయామన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీల ఆత్మగౌరవం వినబడేలా ఎంపీటీసీల సంఘం నుంచి బరిలో నిలిచానని, మన ఓటును మనమే వేసుకుని చట్టసభల్లో తమ హక్కుల సాధన కోసం గళం విప్పుదామన్నారు. కాగా, ఈ నెల 11 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌, బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ విజయలక్ష్మి, ఊశన్న, ఆంజనేయులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love