పశువులు తరలిస్తున్న వాహనం సీజ్

నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుమతులు లేకుండా పశువులు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.  వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్,అనకాపల్లి జిల్లా,నక్కపల్లి మండలం దేవారం కు చెందిన వైబోయిన అప్పల కొండ సమీప ప్రాంతాల్లో తక్కువ ధరలకు పశువులు కొనుగోలు చేసి హైద్రాబాద్ లోని వేంపూడి సంతలో విక్రయిస్తుంటాడు.ఈ దశలో గురువారం పశువులను తరలిస్తుండగా స్థానిక రాష్ట్ర సరిహద్దు. చెక్ పోస్ట్ వద్ద ఎస్.హెచ్.ఓ  ఎస్సై శ్రీరాముల శ్రీను తనిఖీలు నిర్వహించగా వాహనంలో పశువులను గుర్తించారు.రవాణాకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవటంతో వాహనాన్ని సీజ్ చేసి పశువులను పాల్వంచ తరలించారు.పశువులు రవాణా చేస్తున్న అప్పల కొండ పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Spread the love