నవీపేట్ లో రైల్వే గేటును ఢీకొన్న వాహనం

నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలోని రైల్వే గేటుకు సోమవారం వాహనం ఢీకొనడంతో గేటు పూర్తిగా విరిగిపోయింది.దీంతో బాసర, నిజామాబాద్ వైపు వెళ్ళు వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. సమాచారం మేరకు రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వాహనం రైల్వే గేటును ఢీ కొట్టి పరారైనట్లు తెలిపారు. రైల్వే గేటుకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు . ఆయన వెంట రైల్వే పోలీస్ సుధీర్ సింగ్ తదితరులు ఉన్నారు.

Spread the love