రోడ్డు ప్రమాదం లో మహిళ మృతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి (44) బీబీపుర్ తండా వద్ద సోమవారం రాత్రి రోడ్డు దాటుతుండగా ఒక ద్విచక్ర వాహనం ఢీ కోని తివ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం డిచ్ పల్లి మండలం లోని బీబీపుర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని అవుసుల తండా కు చెందిన మాండన్ రాదా బాయి (45) ఒక పని నిమిత్తం రోడ్డు పై వచ్చి తిరిగి స్వగృహానికి వేళ్తుంగా రహదారి పై నుండి వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం రాదా బాయికి ఢీ కొట్టడంతో తివ్ర గాయాలై అసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మహేష్ వివరించారు. మృతురలి కూతురు మాండన్ వళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Spread the love