పురుగుల మందు తాగి యువకుడు మృతి

నవతెలంగాణ – మహాముత్తారం 
పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మహ ముత్తారం మండలంలోని  మహబూబ్ పల్లిల్లో  చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సుధాకర్ దసరి తెలిపిన వివరాల ప్రకారం మహాముత్తారం మండలం మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన తోట రాజేందర్ 32సం, అతను సోమవారం నాడు ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు వెంటనే భూపాల్ పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు అతని తండ్రి తోట చంద్రయ్య ఫిర్యాదు పై మోహన్ రెడ్డి HC  కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేశారు.
Spread the love