ఖమ్మంపల్లి- మంథని ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఖమ్మం పల్లి నుండి మంథని వైపు వెళుతున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లి బోల్తా పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని ప్రథమ చికిత్స కోసం మంథని ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు.