నీటి కుంటలో పడి యువకుడు మృతి..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి  గ్రామ శివారులో గల నీటి కుంటలో యువకుడు పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్కంపల్లి గ్రామానికి చెందిన మంత్రి లక్ష్మణ్ (22)  బర్రెలను మేపుతుండగా బర్రెలు నీటి కుంటలో దిగడంతో వాటిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో లక్ష్మణ్ కుంటలోకి దియడం జరిగింది లోతు తెలియక ఈత రాక కుంటలోనే మునిగి మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. లక్ష్మణ్ పెంపుడు తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Spread the love