సిద్దుల గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణంలోని సిద్దుల గుట్ట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న కాషా దినేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నవి. నిజామాబాద్ రెండు డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళుతున్న సమయంలో పట్టణంలోని సిద్దుల గుట్ట సమీపంలో ఒక ద్విచక్ర వాహనంకు ఢీకొంది. ద్విచక్ర వాహనం బస్సు కింద పడిపోవడంతో దినేష్ కు తీవ్ర  గాయాలయ్యాయి.. దీంతో స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో తీవ్రగాయాలతో ఉన్న ఇతనిని అంబులెన్స్ సిబ్బంది రూపేష్ ,,తిరుమలేష్ లు ప్రథమ చికిత్స అందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు.
Spread the love