అబ్రహాం లింకన్‌ అంతర్యుద్ధ ఉపన్యాసం

అబ్రహాం లింకన్‌ అంతర్యుద్ధ ఉపన్యాసంఅమెరికా అంతర్యుద్ధ కాలంలో పెన్సిల్వేనియా రాష్ట్రం జెట్టిస్‌బర్గ్‌ వద్ద సైనిక శ్మశానవాటికను ప్రారం భిస్తూ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ 19నవంబర్‌1863న 15 వేల మందికి చేసిన సంబోధనే జెట్టిస్బర్గ్‌ ఉపన్యాసం. ఈ శ్మశానం జెట్టిస్‌బర్గ్‌ జాతీయ శ్మశానంగా మారింది. అంతర్యుద్ధపు ముఖ్యనిర్ణయాల ప్రదేశం జెట్టిస్‌బర్గ్‌. ఆ పోరులో నాలుగున్నర నెల్లక్రితమే అమెరికా సైన్యం కాన్ఫెడరేట్దళాలను ఓడించింది. అమె రికా చరిత్రలో జెట్టిస్‌బర్గ్‌ ఉపన్యాసం ముఖ్య మైంది. అంతర్యుద్ధ, బానిసత్వాల అంతం ఈ ఉపన్యాస ఆశయాలు. అమెరికా నుండి వే ర్పాటు ప్రకటించుకున్న గుర్తింపుపొందని 11 వేర్పాటువాద దక్షిణ రాష్ట్రాలను కాన్ఫె డరేట్‌ అంటారు. అది సైన్యాన్ని నిర్మించు కుంది. అంతర్యుద్ధంలో అమెరికాతో యు ద్ధం చేసింది. 1865కు ముందు కొన్ని అమె రికా రాష్ట్రాల్లో బానిసత్వం, బానిసల వ్యాపా రం చట్టసమ్మతం. శ్వేతజాతీయునితో నీగ్రో సమానుడు కాడు. ఉచ్ఛజాతికి నీగ్రోలు లోబడి ఉండా లన్న బానిసత్వం అక్కడి సహజ సామాజిక నియమం. ఏడు బానిస రాష్ట్రాలు దక్షిణ కరోలిన, మిసిసిపి, ఫ్లోరిడా, అలబామా, జార్జియా, లూసి యానా, టెక్సాస్‌ కలిసి 8 ఫిబ్రవరి 1861న కాన్ఫెడరేట్‌ రాజ్యాన్ని, తాత్కాలిక ప్రభు త్వాన్ని ఏర్పర్చుకున్నాయి. ఏ దేశమూ దీన్ని గుర్తించ లేదు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు వీటిని పోరాట రాష్ట్రాలుగా గు ర్తించి ఆయుధాలను, ఇతర సామగ్రిని సరఫరా చేశాయి. తర్వాత నాలుగు రాష్ట్రాలు వర్జీనియా, అర్కన్సాస్‌, టెన్నెసి, ఉత్తర కరోలిన కాన్ఫెడరేట్లో కలిశాయి. నాలుగు సరిహద్దు బానిస రాష్ట్రాలు డెలవరె, మేరీలాండ్‌, కెం టక్కి, మిసౌరిలు అమెరికాలోనే ఉండిపోయాయి. 4.3. 1861 న లింకన్‌ అధ్యక్షుడయ్యారు. 12 ఏప్రిల్‌ 1861న అంతర్యుద్ధం మొదలయింది. అమెరికా సమగ్రత సమై క్యతల రక్షణ లక్ష్యంగా లింకన్‌ అంతర్యుద్ధాన్ని ఎదుర్కొ న్నారు. బానిసత్వ నిషేధం లింకన్‌ ధ్యేయం.ఏ రాష్ట్రంలో కాని, ఒక రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కాని బానిసలను విముక్తి చేస్తానని 1 జనవరి 1863న లింకన్‌ ప్రకటిం చారు. అమెరికా పార్లమెంటు 31 జనవరి 1865న బాని సత్వ రద్దును ఆమోదించింది. 6డిసెంబర్‌1865న 13వ రాజ్యాంగ సవరణతో బానిసత్వం రద్దయింది. 9 ఏప్రిల్‌ 1865 నాటికి క్రమేపీ కాన్ఫెడరేట్‌ దళాలు, నాయకులు బలహీనపడ్డారు. కాన్ఫెడరేట్‌ సానుభూతి పరుడు, నటు డు జాన్‌ విల్కెస్‌ బూత్‌ 15 ఏప్రిల్‌ 1865 న లింకన్‌ను హత్య చేశాడు. కాన్ఫెడరేట్‌ రాష్ట్రాలు అంతమయ్యా యని నాటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ 9మే1865న ప్రకటించారు.
18నవంబర్‌1863 రాత్రి లింకన్‌ గంభీర నిశ్శబ్ద ఆలోచనలో మునిగారు. 19నవంబర్‌1863 ఉదయం అనారోగ్యంగా కనిపించారు. కాగితంపై ఏదో రాసుకు న్నారు. రెండు నిముషాల ఆయన మాటల్లో ప్రతి పదం స్పష్టతతో ప్రతిధ్వనించింది. ఆ స్వరం జనాలను కదిలిం చింది. ఆ ఉపన్యాసాన్ని ప్రజలు నిశ్శబ్దంగా విన్నారు. ”4 స్కోర్ల ఏడేళ్ళ (87) క్రితం మన పితామహులు ఒక కొత్త దేశాన్ని (అమెరికాను) ఈ ఖండంలో స్థాపించారు. స్వేచ్ఛతో, అందరూ సమాన మన్న అంకితభావంతో అది ప్రతి పాదించబ డింది. ఇప్పుడు మనం భయంకర అంతర్యు ద్ధంలో ఉన్నాము. ఇదిమన నిబద్దతను పరీక్షి స్తోంది. భీకర పోరాటంలో మనమిక్కడ సమా వేశమయ్యాము. ఈ దేశ దీర్ఘకాల మనుగడకు ప్రాణాలర్పించిన వారి శాశ్వత విశ్రాంత స్వల్ప స్థలాన్ని అంకితం చేసుకోడానికి ఇక్కడికి వచ్చాం. ఈ అమరులు వ్యర్థంగా మరణించ లేదని, దేవుని అధీన ఈ దేశంలో నూతన స్వేచ్ఛ ఉద్భవించాలని, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం భూమి నుండి మాయం కారాదని (శ్మశానంలో కలవకూడదని) మనమిక్కడ ఉన్నతంగా తీర్మానించుకుందాం.” ఈ వాక్యాలు దశాబ్దాల తరబడి ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. అమెరికాకే కాక అన్ని ప్రభు త్వాలకు శక్తివంతమయిన చలన క్రియాశీలతలకు దారి చూపా యి. అధ్యక్షుని ఆనాటి ఉపన్యాస జాబితాలో లేని జాగ్రత్త గా కూర్చబడిన ఈ సంక్షిప్త లింకన్‌ ఉపన్యాసం అమెరికా ప్రయోజనాలను కాపాడిన అతి ప్రభావశీల వ్యాఖ్యానం. 272 పదాల ఆ ఉపన్యాసంలో అప్పటికి 87 ఏళ్ల క్రితం 4 జులై 1776న 13 రాష్ట్రాలతో ఏర్పడ్డ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను ప్రస్తావించారు. నీతి నిబద్దత, స్వేచ్ఛా స్వాతంత్య్రాల దేశం కోసం ప్రాణాలర్పించి జెట్టి స్బర్గ్‌ శ్మశానంలో నిద్రిస్తున్న అమరుల త్యాగాలను వివరిం చారు. జాత్యహంకారం, బానిసత్వం అమానవీయాలని, మనుషులంతా సమానమని, అంతర్యుద్ధం తప్పక నెగ్గవలసిన పరీక్ష అని అన్నారు. ప్రజాతంత్రం సమాధి కారాదని హెచ్చరించారు. లింకన్‌ జెట్టిస్బర్గ్‌ ఉపన్యాసం అమెరికా అంతర్యుద్ధంలో ఐరోపా దేశాల జోక్యాన్ని తగ్గించింది.
పాలకుల ఉపన్యాసాలు ప్రజలకు నమ్మకం కలిగిం చాలి. సమస్యలను పరిష్కరించాలి. సమస్యల సృష్టి కర్త లకు మానవీయ ఆలోచన కలిగించాలి. ఒకరిని మరొ కరిపై రెచ్చగొట్టరాదు. స్వాతంత్య్ర సమరవీరులు అంకిత భావంతో, పవిత్ర కర్తవ్యంగా చేసి మిగిలిన పనులను పూర్తిచేయాలి. వారు సాధించిన తాత్విక సిద్ధాంత భౌతిక సంప దలను నాశనం చేయరాదు. మాటలు కాక చేతలు భావితరాలకు మేలుచేస్తాయి. వారి త్యాగఫలిత స్వాతం త్య్రానికి నేటి పాలకులు భంగం కలిగించరాదు. ముందు తరాల పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి అనేక హక్కు ల నిచ్చాయి. వాటిని కాపాడాలి. సామాజికార్థిక రాజకీ య సమానతలులేక తమ హక్కులే తెలియనివారికి సహ కరిద్దాం. పెట్టుబడి దారీ సమాజంలో సంక్షేమ రాజ్యాన్ని ఆశించలేము. కార్పొరేట్ల కొమ్ముకాయని సంక్షేమ పథకా లను ఆహ్వానిద్దాం.
స్వేచ్ఛా స్వాతంత్య్ర, సామ్యవాద, మార్క్సిస్టు సిద్ధాం త కర్తలైన వామపక్ష పోరాటయోధులతో సహా భారత జాతీయోద్యమ నాయకుల త్యాగాలను నేటి పాలకులు వక్రీకరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పాతరేశారు. రాజ్యాంగ లోపాలను వాడుకొని ప్రజావ్యతిరేక చట్టాలను చేస్తున్నారు. భారత సామాజిక సమైక్యత సంరక్షణ నేటి మన అవసరం. లింకన్‌ను చంపిన జాన్‌ విల్కెస్‌ బూత్‌ లు గాంధీని హంతక మతోన్మాద గాడ్సేల రూపంలో భారతంలోనూ తయారయ్యారు. ఇప్పుడు పాలక గాడ్సేలు పెరిగారు. నేటి భారత నిరంకుశ, కార్పొరేట్‌ ఫాసిస్టు ధోరణులను ప్రజలు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. ప్రజా స్వామ్య ప్రత్యామ్నాయ ప్రజారాజకీయ పార్టీలను సమ ర్థించే చైతన్యాన్ని ఈ నిశ్శబ్ద భవిష్యత్తు నిర్ణేతలకు అందిం చాలి. లింకన్‌ నిర్వచించిన ప్రజాస్వామ్య ప్రభుత్వ అవస రాన్ని గుర్తుచేయాలి. ప్రజా సంక్షేమ సమసమాజ విధా నాల పార్టీలు ఫాసిస్టు వ్యతిరేక లక్ష్యంలో కలిసి పనిచే యాలి. మనమిప్పుడు అపాయకర భయంకర భవిష్య త్తును కాపాడుకోవలసిన పరీక్షా సమయంలో ఉన్నాము. ఇది మనం తప్పక గెలవాల్సిన పరీక్ష.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
949020 4545

Spread the love