నవతెలంగాణ-గోవిందరావు పేట : మండలంలోని ముత్త పూర్ గ్రామంలో బుధవారం బూతు అధ్యక్షులు కల్తీ బాబురావు ఇల్లు ప్రమాదవశత్తు కాలిపోవడం జరిగినది. సమాచారం తెలుసుకున్న బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు గుగులోతు స్వరూప బాధితులకు 50 కేజీల బియ్యం బట్టలు నిత్యావసర సరుకులు అందించడం జరిగినది ప్రభుత్వం నుండి పక్కా ఇల్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తి హరీష్ మద్దినేని కోహుల్ కోడి శేఖర్ రాకేష్ గుగులోతు పరమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగినది.