న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల బ్రాండ్ ఏథర్ ఎనర్జీ కొత్తగా బజాజ్ ఫిన్సర్వ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇవి ద్విచక్ర వాహనాల వినియోగదారులకు సులభమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందని ఆ సంస్థ పేర్కొంది. ”మా వినియోగదారులకు మరింత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందించేందుకు ఏథర్ బలమైన ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తుండగా, దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించనుంది.” అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఫోకెలా పేర్కొన్నారు.