వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి..

– మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి 
నవతెలంగాణ – మల్హర్ రావు
వడదెబ్బతో తూoడ్ల సమ్మయ్య (55) అనే వ్యవసాయ కూలి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన తాడిచెర్లలో శుక్రవారం చోటుచేసుకుంది.స్థానికుల పూర్తి కథనం ప్రకారం సమ్మయ్య శుక్రవారం ఉదయమే పొలాల్లో ట్రాక్టర్ ద్వారా పశువుల పాటు (ఎరువు) పోయాడానికి కూలి పనికి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో తలతిరుగుతుందని, చెట్టుకింద సేద తీర్చుకోవడానికి కూర్చొని వాoతులు చేసుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. మృతునికి ఇద్దరు పిల్లలు,భార్య ఉంది. కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడిందని ఆర్ధికంగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే రోహిణి కార్తె కావడంతో తన ప్రతాపాన్ని చూపుతోంది. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Spread the love