పండ్ల విభాగంలోకి అక్షయకల్ప ఆర్గానిక్‌ ప్రవేశం

హైదరాబాద్‌ : దేశంలోనే తొలిసారి గుర్తింపు పొందిన ఆర్గానిక్‌ పాల ఉత్పత్తుల కంపెనీ అయిన అక్షయకల్ప ఆర్గానిక్‌ కొత్తగా ‘గ్రీన్స్‌’ పేరుతో సేంద్రియా కూరగాయలు, పళ్ల కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ సీఈఓ, వ్యవస్థాపకులు శశి కుమార్‌ మాట్లాడుతూ.. మొదటి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని 50 పైగా పట్టణాలు, నగరాల్లో తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. దశలవారీగా పండ్లు, కూరగాయల డెలివరీని ప్రారంభించనున్నామన్నారు.

Spread the love