– గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్
నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో 2024 -25 విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కోరారు. శుక్రవారం కలెక్టరేట్ ని తన చాంబర్ లో నమూనా దరఖాస్తు గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక గిరిజన ,మహాత్మ జ్యోతిబాపూలే, వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2024 -25 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రథమ సంవత్సరం (ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12 చివరి తేదనీ, అదే నెల 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న, అర్హులైన విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రాంతీయ సమన్వయకర్త కే నిర్మల, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి సునీత, వైస్ ప్రిన్సిపల్ ఎండి రిజ్వాన, అధ్యాపకులు ఎస్ వనజ, ఏ ఉమాదేవి, కే కావ్య తదితరులు పాల్గొన్నారు.