హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు నియామకం

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ నియోజకవర్గ  బీఆర్ఎస్ అధికార ప్రతినిధులుగా ఐలేని మల్లికార్జున్ రెడ్డి, సుద్దాల చంద్రయ్య మంగళవారం పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో నియమించిన అధికార ప్రతినిధి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.
Spread the love