కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం 

– చిలువేరు శ్రీనివాస్ రెడ్డికి నియామకపత్రమందజేత 
నవతెలంగాణ-బెజ్జంకి
కాంగ్రెస పార్టీ కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన చిలువేరు శ్రీనివాస్ రెడ్డి నియామకమైయ్యారు.సోమవారం కిసాల్ సెల్ రాష్ట్రాధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి హైదరాబాద్ గాందీ భవనం యందు శ్రీనివాస్ రెడ్డికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకపత్రమందజేశారు.తన నియామకానికి సహకరించిన జిల్లాధ్యక్షుడు తాముకుంట నర్సారెడ్డి, కరీంనగర్ జిల్లాధ్యక్షుడు సత్యనారాయణ,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లాధ్యక్షుడు బాలకృష్ణ రెడ్డి, మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు రొడ్డ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Spread the love