దారుణం.. పశువును కాపాడే ప్రయత్నంలో ఐదుగురు మృతి

నవతెలంగాణ – జార్ఖండ్‌: బావిలో పడిపోయిన ఓ పశువును కాపాడేందుకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాంచీ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని పిస్కా గ్రామంలో వారం సాయంత్రం ఓ పశువు బావిలో పడిపోయింది. అది గమనించిన స్థానికులు కొందరు దాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. తాళ్ల సాయంతో నలుగురు బావిలోకి దిగారు. పైన మరికొంతమంది వ్యక్తులు తాళ్లను పట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో బావిపై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బావిలోని నలుగురు అందులో కూరుకుపోయారు. పైన ఉన్న వ్యక్తులు కూడా బావిలో పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు కొందరిని రక్షించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love