నదిలో పడిన బస్సు… 40 మంది ప్రయాణికులు…

నదిలో పడిన బస్సు...
నదిలో పడిన బస్సు…

నవతెలంగాణ హైదరాబాద్: ఝార్ఖండ్‌లోని గిరిద్ జిల్లాలో అదుపు తప్పి ఓ బస్సు బడాకర్‌ నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సంఘటన స్థలికి బయల్దేరి వెళ్లారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి అంబులెన్స్‌లు పంపించారు. అయితే ఎంత మంది మృతి చెందారన్నదానిపై స్పష్టత లేదు.

Spread the love