- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్లోని మొహాలీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన మాజీ ప్రేయసిని ఆమె ఆఫీస్లోనే కత్తితో సుమారు 20 సార్లు పొడిచి హత్య చేశాడు. ఆపడానికి వచ్చిన వారిపై కూడా కత్తితో దాడికి దిగాడు. కాగా, ఈ దాడిలో యువతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు అతడిని హర్వీందర్ మాన్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



