కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై వేటు..

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన కిరణ్‌ రిజిజును ఆ బాధ్యతలనుంచి తప్పించి.. భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే, కిరణ్‌ను తప్పించడానికి కారణాలు ఏమైనా.. ఆయన న్యాయవ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా న్యాయవ్యవస్థలో నియామకాల కోసం అనుసరించే కొలీజియం వ్యవస్థతోపాటు కోర్టు వ్యవహారాల్లో పారదర్శకతపై ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతకాలంగా చర్చనీయాంశమవుతున్నాయి. న్యాయవ్యవస్థపై బహిరంగంగా విమర్శలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆయనపై వేటుపడినట్లు తెలుస్తోంది.

Spread the love