భార‌త్‌తో టీ20 సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: భార‌త్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు చెందిన 15 స‌భ్యుల బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. కీప‌ర్ మాథ్యూ వేడ్ ఆ జ‌ట్టుకు సార‌థ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఆసీస్ జ‌ట్టులో వార్న‌ర్‌, స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్‌, మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్‌, జంపా కూడా ఉన్నారు. వ‌చ్చే నెల‌లో ఆస్ట్రేలియా, ఇండియా మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ది. ఆసీస్ జ‌ట్టులో చాలా వ‌ర‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడిన ప్లేయ‌ర్లే ఉన్నారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడుతున్న క‌మ్మిన్స్‌, స్టార్క్‌, హేజ‌ల్‌వుడ్‌లు .. ఆ టోర్నీ త‌ర్వాత స్వ‌దేశం తిరిగి వెళ్ల‌నున్నారు. కెమ‌రూన్ గ్రీన్‌, మిచెల్ మార్ష్ కూడా స్వ‌దేశం వెళ్తారు. న‌వంబ‌ర్ 23, 26, 28, డిసెంబ‌ర్ 1, 3 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Spread the love