నవతెలంగాణ-టేకుమట్ల
మండల కేంద్రంలో పిఆర్ఎంఆర్ గార్డెన్లో జిల్లా ప్రధానకార్యదర్శి తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీఎల్ఏల అవగాహన సదస్సుకు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ.. బీఎల్ఏలు తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని స్వయంగా సందర్శించి, ఓటరు నమోదు ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, టిపిసిసి కోఆర్డినేటర్ సిరాజ్ అహ్మద్, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి, రవీందర్, దొంతుల శ్రీనివాస్, లింగపల్లి కిరణ్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్లు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పిఆర్ఎంఆర్ గార్డెన్లో బీఎల్ఏల అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



