రెంజల్ మండలంలో ఘనంగా ఆయేషా ఫాతిమా జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ ఆవరణలో బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమీర్ సతీమణి అయేషా ఫాతిమ జన్మదిన వేడుకలను స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో, బోర్గం గ్రామంలోని పాఠశాలలో, తాడేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love