నామినేషన్ దాఖలు చేసిన బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు నిజామాబాద్  జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా నివాసంలో ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలను ఉంచి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు  నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ నిర్వహించారు. అనంతరం నామినేషన్ తన నివాసం నుండి బయలుదేరి మార్గమధ్యంలో మహాలక్ష్మి నగర్ బ్యాంకు కాలనీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి   బాల్కొండ శాసన సభ్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే  గణేష్ గుప్తా , మాజీ మంత్రివర్యులు  వి శ్రీనివాస్ గౌడ్, బోధన్ మాజీ శాసన సభ్యులు  షకీల్ ఆమెర్  సతీమణి అయేష సుల్తానా , జగిత్యాల జడ్పీ చైర్మన్ దావ వసంత ల తో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
Spread the love