రేపు జరగబోయే బహిరంగ సభకు మాజీ మత్రి హరీష్ రావు రాక

– నిజామాబాద్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలి
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రేపు అనగా 19/04/2024 శుక్రవారం జరగబోయే ఉదయం 10:00 గంటలకు ఓల్డ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొంటారు. అనంతరం ఎంపీ అభ్యర్థి  బాజిరెడ్డి గోవర్ధన్  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, వద్ద నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నామినేషన్‌ ‌పక్రియలో మాజీ మంత్రివర్యులు హరీష్‌ ‌రావు  పాల్గొంటారు. కావున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్లు జెడ్పీటీసీ, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ  మండలాల అధ్యక్షులు, పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కాగలరు అని తెలియజేశారు.
Spread the love