– ఏఐసీసీకి పొన్నం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీసీ సామాజికతరగతి అత్యధికంగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వారికి పెద్ద పీట వేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అధిష్టానాన్ని కోరారు. దీంతోపాటు వారి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో బీసీ డిక్లరేషన్లో పొందుపరచాల్సిన అంశాలపై కాంగ్రెస్లోని బీసీ నేతలు చర్చించారు. అనంతరం కత్తి వెంకటస్వామి, నూతి శ్రీకాంత్, గాలి అనిల్కుమార్, గౌరీ సతీష్, ఈర్లపల్లి శంకర్, వెంకటేష్, మెట్టు సాయి కుమార్తో కలిసి పొన్నం విలేకర్లతో మాట్లాడారు.ఇప్పటికే పీఏసీలో నిర్ణయం మేరకు అత్యధిక సీట్లు కేటాయించాలని తీర్మానించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ అండగా ఉంటుందనే నమ్మకాన్ని బీసీ డిక్లరేషన్ ద్వారా కల్పిస్తామన్నారు.