బీజేపీ అధికారమే లక్ష్యంగా పని చేయాలి

– కర్నాటక ఎమ్మెల్యే మహేష్ తెంగినకై 
నవతెలంగాణ పెద్దవంగర:
తొమ్మిదేళ్ల మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బూత్ స్థాయిలో ప్రజలకు వివరించి పార్టీ అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ కర్నాటక ఎమ్మెల్యే మహేష్ తెంగినకై అన్నారు. బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షుడు బొమ్మెరబోయిన సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి, పెదగాని సోమయ్య లతో కలిసి ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో చేపట్టిన తొమ్మిదేళ్ల పాలనలో పలు సంక్షేమ పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రతీ గడపకు సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్రప్రభుత్వ అభివృద్ధిని ప్రతీ ఇంటికి వివరించి, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అటు కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి, పాకనాటి దామోదర్ రెడ్డి, కుందూరు గోపాల్ రెడ్డి, రంగు రాములు, పూసల శ్రీమాన్, సుంకరనేనీ కోటి, సాయిని ఝాన్సీ రవి, మోడపల్లి సోమన్న, రచ్చకుమార్, కొలుపుల శంకర్, తలారి సోమన్న, తొర్రూరు, పాలకుర్తి మండల అధ్యక్షులు బొచ్చు సురేష్, కమ్మగాని శ్రీకాంత్, జాటోత్ శంకర్, జాటోత్ దేవేందర్, జలగం ఆనంద్, ఉడుత శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love