ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

– బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయితరాజు అబ్బేందర్ నవతెలంగాణ -చండూరు ఆశీర్వదించండి .. బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్య ర్థిగా గెలిపిస్తే మీ ప్రాంత సేవకుడిగా పని చేస్తానని అయితరాజు అబ్బేందర్ తెలిపారు. ఆదివారం మున్సిపల్ పట్టణంలో స్థానిక చౌరస్తాలో ప్రచారాలు పాల్గొని మాట్లాడారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్మికులకు తనను పార్లమెం ట్ ఎన్నికల్లో గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్ సు ఈదేశంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బెల్లి లలిత స్ఫూర్తితో రాజకీయల్లోకి వచ్చానన్నారు. నిరుద్యోగ సమస్యలు, కాలుష్యం కోరల్లో నియోజకవర్గం కొట్టుమీట్టుడు తుందని, అన్ని రంగాల్లో వెనకబాటుకు గత పాలకులు కారణం అయ్యారని, తెలిపారు.కేంద్రప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరోసారి అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేస్తారని, ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీల పేరుతో అమలు చేయడంలో విఫలం అయ్యారని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అధి కారంలో ఉన్నప్పుడు ప్రజలకు అత్యుత్తమ పాలనను అందించారని, తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్య ర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో అసెంబ్లీ కన్వీనర్ నేరెళ్ల ప్రభుదాస్ , అసెంబ్లీ అధ్యక్షులు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల వెంకటయ్య, కత్తుల పరమేష్,బుష్పాక మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love