– మ్యూజిక్ డైరెక్టర్ చక్రికి ఘనంగా నివాళ్లు
నవతెలంగాణ-శామీర్ పేట
రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాల ని మాజీ ఉప సర్పంచ్ యూసుఫ్ బాబా యువతకు పిలుపునిచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి జయంతి సందర్భంగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ సహకారంతో శామీర్పేట మండలం తుర్కపల్లిలో ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం తల సేమియాతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చక్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ బాబు, సింగర్ విజయలక్ష్మి, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్, గ్రామ పెద్దలు, మాజీ ఉపసర్పంచ్ యూసుఫ్ బాబా, ప్రగతి యువజన సంఘం అధ్యక్షుడు శ్రీధర్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు షేక్ ఇబ్రహీం, దాసరి రవి, నీరుడి అశోక్, బండి రాజేష్ , మేడబోయిన నర్సింగ్ రావు , తదితరులు పాల్గొన్నారు.