సిర్పూర్‌ గడ్డపై నీలి జెండా ఎగరాలి

– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి రాబోయే ఎన్నికల్లో సిర్పూర్‌ గడ్డపై నీలి జెండా ఎగరవేయాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఆ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌లో ఆదివారం బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిర్పూర్‌ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా అహర్నిశలు పార్టీ కోసం పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,అగ్రవర్ణ పేదలను పార్టీలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

Spread the love