- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు ఓ ఆగంతుకుడు మెయిల్ చేసి బెదిరించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చని హెచ్చరించాడు. అయితే, విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై విమానంలోని ప్రయాణికులను కిందకి దింపి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధరించారు.
- Advertisement -



