Wednesday, June 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబైక్‌ను ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి

బైక్‌ను ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని నారాయణగిరిపల్లె గ్రామం వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నలేంద్ర లక్ష్మి(40), కుమార్తె దీపిక(19), కుమారుడు సాయికిరణ్‌తో కలిసి బైక్‌పై గణపురం వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్‌ వైపు నుంచి వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ, దీపిక మృతి చెందారు. సాయికిరణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. కొందరు రైతులు వరి కొయ్యలకు మంట పెట్టడంతో పొగ వ్యాపించి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -