కమ్మర్ పల్లి లో బోనాల ఊరేగింపు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో ఆదివారం స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత నాలుగు రోజులుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా గ్రామంలోని గౌడ సంఘం మహిళలు ఇంటికో బోనం తరలివచ్చి పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.డప్పు చప్పులతో గ్రామం నుండి  శ్రీగిరి క్షేత్రం సమీపంలో ఉన్న  రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు కొనసాగింది. బోనాలతో రేణుక ఎల్లమ్మ ఆలయం వద్దకు చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించుకున్నారు.బోనాల ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
Spread the love