బూతు ఏజెంట్లకు దిశా నిర్దేశం చేసిన ప్రభుత్వ విప్..

నవతెలంగాణ – వేములవాడ 
పార్లమెంట్ ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో వేములవాడ పట్టణ బూతు లెవెల్ ఏజెంట్లకు ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దిశా నిర్దేశం చేశారు..ఈ సందర్భంగా ఆది  మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లను అభ్యర్థించిన కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు జరిగే పోలింగ్ కేంద్రాల్లో బూతు లెవెల్ ఏజెంట్లు తగు జాగ్రత్తలు తీసుకుంటూ,ఓటర్ లిస్టులో పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గెలుపులో ప్రతి ఓటు కీలకమని ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చూసుకోవాలన్నారు.
ప్రభుత్వ విప్ ఆదితో కలిసి బైక్ రైడ్ చేసిన మంత్రి పొన్నం..
వేములవాడ  తిప్పాపుర్ బస్ స్టాప్ నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు వేములవాడ విధుల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి బైక్ రైడ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, స్వయంగా బైక్ నడుపుతూ వేములవాడ ప్రజలను  ఆకర్షించాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ నడుపుతున్న బైక్ వెనకాల కూర్చొని ప్రజలకు అభివాదం చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అనంతరం ఓ హోటల్ చాయ్ తాగుతూ ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది..
Spread the love