భారత్ కు మరో స్వర్ణం అందించిన బోపన్న, రుతుజా జోడీ

నవతెలంగాణ – చైనా: చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ ఈ వెంట్లో రోహన్ బోపన్న రుతుజా భోసాలే జోడీ ఫైనల్లో విజయకేతనం ఎగురవేసింది. చైనీస్ తైపీకి చెందిన ఎన్ షువో లియాంగ్, త్సుంగ్ హావో హువాంగ్ జోడీపై 2-6, 6-3, 10-4తో బోపన్న, రుతుజా అద్భుత విజయం సాధించారు. భారత జోడీ తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత పోరాట పటిమతో పుంజుకుని మ్యాచ్ ను, తద్వారా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 9 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్యాలు సహా మొత్తం 35 పతకాలు ఉన్నాయి.

Spread the love