కరువు పేరుతో రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్‌, బీజెపీ

– రైతులను ఆదుకుంటాం, అధైర్య పడవద్దు
– కాంగ్రెస్‌ కరువుతెచ్చిందనడం విడ్డూరంగా ఉంది
– ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ-కోహెడ
ప్రకృతి వైపరిత్యాన్ని గుర్తించకుండా కరువు పేరుతో బీఆర్‌ఎస్‌, బీజెపీ పార్టీలు రాజకీయం చేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మిగార్డెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు పదవులు వచ్చే విధంగా చూస్తామన్నారు. అలాగే కార్యకర్తలు సమన్వయంతో మెదిలి పార్లమెంట్‌ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. వేసవికి ముందే భూగర్భ జలమట్టం పడిపోవడంతో నీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. కాంగ్రెస్‌ కరువు తెచ్చిందని మాజీ సీఎం కేసీఆర్‌ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. కరువుకు కాంగ్రెస్‌ కారణమని చేస్తున్న దుష్ప్రచారాన్ని గ్రామాల్లో ఖండిరచాలన్నారు. మీరు ఓట్లు వేస్తే మంత్రిని అయ్యానని, నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవచేస్తానన్నారు. గ్యారెంటీ స్కీములపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బిజెపి ఎన్నికల్లో ప్రధాని మోడీ ఫోటో కాకుండా రాముడి ఫోటో పెట్టుకుని ఓట్లు అడిగే పరిస్థితి వచ్చిందని ఏద్దేవా చేశారు. నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు అందేవిధంగా తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఇంకా కల్లాలకే ధాన్యం రాలేదు, కల్లాల దగ్గర పండుకుంటా అని ఎంపీ బండి సంజయ్‌ అంటున్నాడని విమర్శించారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందేలా చూడాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చెసేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బీజెపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పబ్బం గడుపుతున్నాయన్నారు. భూ తగాదాలను గ్రామస్థాయిలోనె పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని చెంచల్‌చెర్వుపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేలవాలయం, నవగ్రహా ధ్వజ శిఖర యంత్రం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, మాజీ సర్పంచ్‌లు దొమ్మాట జగన్‌రెడ్డి, గొరిట్యాల లక్ష్మణ్‌, శెట్టి సుధాకర్‌, మల్లారెడ్డి, సీనియర్‌ నాయకులు వేల్పుల వెంకటస్వామి, బందెల బాలకిషన్‌, బోయిని జయరాజ్‌, దూలం శ్రీనివాస్‌, అబ్దుల్‌ రఫీ, రాచూరి శ్రీనివాస్‌, రాజిరెడ్డి, గూడ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love