బీఆర్‌ఎస్‌ ఖేల్ ఖతం.. దుకాణం బంద్

 – ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి.
నవతెలంగాణ- మాక్లూర్: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖతం అవుతుందని, తన దుఖనం బంద్ చేస్తుందని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటురి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలో  ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మోరా, మందాపూర్, లక్నాపూర్, వెంకటాపురం, మెట్టు, గొట్టుముక్కల, బొంకాన్ పల్లి, ముల్లంగి(బి), కృష్ణ నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ ప్రచారానికి ప్రజలు భారీ ఎత్తున మహిళలు మంగళ హారతులతో  ప్రతి గ్రామలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ పూల వర్షంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి  వినయ్ కుమార్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. తన పైన ఇంత అభిమానం ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వారాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఖేల్ ఖతాం.. దుకాణం బంద్ అని అన్నారు. ఆర్ముర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ, చేతు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని అన్నారని తెలిపారు. ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే  అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేశాడని, ప్రతి గ్రామంలో అన్ని వర్గాల వారు చెప్పడం జరిగిందని అన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల కమ్యూనిటీ హాళ్ల కోసం డబ్బులు ఇస్తానని, ఇప్పుడే ఫోన్ పే ద్వారా కొడతానని, ఐదు సంవత్సరాలు గడిచిన డబ్బులు ఇవ్వలేదని వివిధ గ్రామాల  సంఘ పెద్ద మనుషులు చెప్పారని  అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీలను  60 రోజుల్లో అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతినెల రూ. 2500 రూపాయలు,  వృద్ధప్య పింఛన్లు రూ. 4000వేలు, ఉచిత కరెంట్, రైతులకు పంటకు రూ. 15000, అదనంగా రూ. 500 బోనస్ ఇవ్వబడుతుందని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు.  ఆర్మూర్ నియోజకవర్గంలోని  ప్రతి కుటుంబంలో  ఉన్న ఓట్లను కాంగ్రెస్ పార్టీకి, హస్తం గుర్తుకు ఓటు వేసి  భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, బ్లాక్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ రాజ్ సంఘటన అధ్యక్షులు గంగాధర్ గౌడ్, జిల్లా నాయకులు డేగ పోషేట్టీ, రాజేశ్వర్, దయాకర్ రావు, జైల్ సింగ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Spread the love