- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
విద్యుత్ షాక్తో ఎద్దు మృత్యువాత చెందిన ఘటన మండలంలోని జాంగం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జాంగం గ్రామానికి చెందిన బొమ్మిడి మల్లేష్ తన పశువులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళి ఓ చెట్టుకు కట్టేశాడు. అయితే పశుగ్రాసం కోసం అటుఇటు కదులుతున్నన క్రమంలో కింద తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఎద్దు అక్కడిక్కడే మృత్యువాత చెందిందని తెలిపారు. దీంతో రైతు మల్లేష్ కన్నీరుమున్నీరయ్యారు. నష్టపోయిన రైతుకు రూ.60 వేలు నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
- Advertisement -



