- Advertisement -
పద్మశాలి సంఘం సభ్యుడు సూరిపల్లి రాము-రాణి
నవతెలంగాణ-నెల్లికుదురు
కాలుష్య నివారణకు మట్టి వినాయకుడినే ప్రతిష్టించండని పద్మశాలి సంఘం నాయకుడు సూరిపల్లి రాము-రాణి తెలిపారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఆదివారం మట్టితో తయారు చేసే వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందనీ, దాని నివారించేందుకు మనవంతు ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేమే స్వయంగా మట్టి వినాయకుని తయారు చేసుకుని, వినాయక చవితికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కైరం కొండ జ్యోతి, సూరిపల్లి అమృత తదితరులున్నారు.
- Advertisement -



