7 భాషల్లో అజాగ్రత్త..

శ్రేయాస్‌ తల్పడే, రాధిక కుమారస్వామి జంటగా రూపొందుతున్న చిత్రం ‘అజాగ్రత్త’. ఎం శశిధర్‌ దర్శకత్వంలో రవి రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా టాలీవుడ్‌ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఏ ఎం రత్నం క్లాప్‌ కొట్టగా, నిర్మాత ఠాగూర్‌ మధు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు.
సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాలో రావు రమేష్‌, సునీల్‌, ఆదిత్య మీనన్‌ వంటి హేమాహేమీలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రవి రాజ్‌ మాట్లాడుతూ, ‘మంచి కథతో ఈ సినిమాని అన్ని భాషల్లో నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. ‘ఈ సినిమాను ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి మంచి ప్రొడక్షన్‌ కంపెనీలో ఛాన్స్‌ దొరకడం, నాయిక రాధిక అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది’ అని దర్శకుడు ఎం శశిధర్‌ అన్నారు. రాధిక కుమారస్వామి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉండాల్సింది. కానీ హీరోయిన్‌గా ఫిక్స్‌ అవుతాను అని అనుకోలేదు. స్క్రిప్ట్‌ విన్నాక షాక్‌ అయ్యాను. చాలా ఏళ్ల తరువాత ఇలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’ అని తెలిపారు. ‘సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే సినిమా’ అని శ్రేయాస్‌ తల్పడే చెప్పారు.

Spread the love