అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు న‌మోదు

నవతెలంగాణ – హైద‌రాబాద్‌: ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీపై ఇవాళ సంతోష్ న‌గ‌ర్‌లోని పోలీసు స్టేష‌న్‌లో కేసు బుక్కైంది. ఐపీసీలోని 353తో పాటు ఇత‌ర కొన్ని సెక్ష‌న్ల కింద కేసును న‌మోదు చేసిన‌ట్లు డీసీపీ రోహిత్ రాజు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అక్బ‌రుద్దీన్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ల‌లితాబాగ్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మయంలో.. ప్ర‌చారం ముగించాల‌ని స్థానికంగా విధులు నిర్వ‌స్తున్న పోలీసు ఆఫీస‌ర్ కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసు ఆఫీస‌ర్‌పై అక్బ‌రుద్దీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల అస‌దుద్దీన్ ఓవైసీ ఇవాళ స్పందించారు. ఒక‌వేళ స‌మ‌యం రాత్రి 10.01 నిమిషం దాటితే అప్పుడు ఆ స‌భ‌ను అడ్డుకునే హ‌క్కు ఉంటుంద‌న్నారు. ఇంకా అయిదు నిమిషాలు ఉన్నా ఎందుకు పోడియం వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని అడిగారు.

Spread the love