నవతెలంగాణ – గోవిందరావుపేట
ఉపాధి కూలీల నగదు చెల్లింపులో తపాలా కార్యాలయంలో ఎలాంటి సమస్యలు ఉండరాదని డిఆర్డిఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో తపాలా కార్యాలయాన్ని శ్రీనివాస్ సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలీలకు తపాలా అధికారులు అవసరమైన సలహాలు సూచనలు చేస్తూ చెల్లింపులలో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. గతంలో జరిగిన కూలీ డబ్బులు చెల్లింపుల రికార్డులను శ్రీనివాస్ పరిశీలించారు. తపన అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముందు ముందు కూడా కూలీలకు నగదు తీసుకునే విషయంలో పూర్తిస్థాయిలో సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో ప్రసూనారాణి తపాలా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.