చల్వాయి పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం

నవతెలంగాణ – గోవిందరావుపేట 

మండలంలోని చల్వాయి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం చల్లని త్రాగునీరు అందించి చలివేంద్రం ను ఎంపీడీవో జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ 163 వ జాతీయ రహదారి వెంట ప్రయాణికులు వాహనదారులు ఎండాకాలంలో విపరీతమైన దాహార్తితో ఉంటారని వారి దాహర్తికి తీర్చడానికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా గ్రామంలోని రైతులకు వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చే సమయంలో కూడా వారి దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని అందరూ ఈ చలివేంద్రంలో పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భారతి ఈజీఎస్ ఏపిఎం ప్రసూన పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love