‘ఇండియా’తో సవాలే: మంత్రి ప్రధాన్‌

నవతెలంగాణ- న్యూఢిల్లీ: విపక్షాల కూటమి ‘ఇండియా’ నిజంగా సవాలు విసిరేదేనని, దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌డీఏ కూటమి ప్రతి ఎన్నికనూ చాలా ముఖ్యమైనదానిగానే పరిగణిస్తుంటుందని, అందువల్ల ఇండియా కూటమిని కూడా నిజమైన పోటీదారుగా భావిస్తుందని చెప్పారు.

Spread the love