బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి..

నవతెలంగాణ – హన్మకొండ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. వంగరలో దివంగత పీవీ నరసింహారావు ఇంటిని సందర్శించిన అనంతరం ఆయన ముల్కనూరు బయలుదేరారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో అవి కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోనూ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.

Spread the love