ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు నిరుపేదలకు వారం..

– బాజిరెడ్డి జగన్ మోహన్..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు నిరుపేదలకు కొండంత అండగా ఉందని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తులు చేస్తున్న లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే చెక్కుల రూపంలో డబ్బులు వస్తున్నాయని ఒలింపిక్ జిల్లా ఉపాధ్యక్షులు, దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు.బుదవారం ఇందల్ వాయి మండలం లోని మల్లాపూర్  గ్రామానికి చెందిన ఎంపీల్లో పుష్ప కు 36 వేలు,బాకారం సురేష్ కు 12వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మోహన్ మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ లో ఇప్పటి వరకు కోట్ల రూపాయల మేర సహాయ నిధి నుండి మంజూరు చేయించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఇందల్ వాయి మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రఘునథన్ రాము, నాయకులు డీకోండ సుదిర్, తటిపాముల శ్రీనివాస్ గుప్త తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love